Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు హీరో సినిమాకు ముహూర్తం ఖరారు, ఆ ఇద్దరు నిర్మాతలు నిర్మిస్తున్నారు!
ఒక్క క్షణం సినిమా విడుదల తరువాత అల్లు శిరీష్ తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు ఈ హీరో. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి (అమెరి బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) సినిమాను అల్లు శిరీష్ రీమేక్ చెయ్యబోతున్నాడు. నూతన దర్శకుడు సంజీవ్రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు.
జూన్నుండి షూటింగ్ మొదలుకాబోతున్న ఈ సినిమా మే 30న ముహూర్తం జరుపుకోనుంది. ఇందులో అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. కథ మొత్తం హీరో పాత్ర జర్నీ మీదే నడుస్తుంటుంది. అల్లు శిరీష్ కు ఇది కొత్త పాత్ర, అదే విధంగా బాగా సెట్ అయ్యే పాత్ర.
నిర్మాత మధుర శ్రీధర్, యష్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో అల్లు శిరీష్ విజయం సాధించాలని కోరుకుందాం.