twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు హీరో సినిమాకు ముహూర్తం ఖరారు, ఆ ఇద్దరు నిర్మాతలు నిర్మిస్తున్నారు!

    |

    ఒక్క క్షణం సినిమా విడుదల తరువాత అల్లు శిరీష్ తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు ఈ హీరో. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి (అమెరి బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) సినిమాను అల్లు శిరీష్ రీమేక్ చెయ్యబోతున్నాడు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు.

    జూన్‌నుండి షూటింగ్ మొదలుకాబోతున్న ఈ సినిమా మే 30న ముహూర్తం జరుపుకోనుంది. ఇందులో అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. కథ మొత్తం హీరో పాత్ర జర్నీ మీదే నడుస్తుంటుంది. అల్లు శిరీష్ కు ఇది కొత్త పాత్ర, అదే విధంగా బాగా సెట్ అయ్యే పాత్ర.

    Allu hero film gets a launch date, that two producers producing

    నిర్మాత మధుర శ్రీధర్, యష్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో అల్లు శిరీష్ విజయం సాధించాలని కోరుకుందాం.

    English summary
    The Malayalam film ABCD (American-Born Confused Desi) is all set to be remade inTelugu under the same title. Allu sirish playing main lead in this film. official announcement of the film will happen very soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X