Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్ బ్యాచలర్ పార్టీ పై అల్లు శిరీష్
త్వరలో పెళ్లి కొడుకు అవుతున్న రామ్ చరణ్ రీసెంట్ గా గోవాలో బ్యాచులర్ పార్టీ చేసుకున్నాడంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అల్లు శిరిష్ ట్విట్టర్ లో స్పందిస్తూ..అది బ్యాచులర్ పార్టీ కాదు. రెండు కుటుంబాలకు చెందిన క్లోజ్ రిలెటివ్స్, ప్రెండ్స్ కలిసిన గెటు టు గెదర్ అంతే..రామ్ చరణ్, ఉపాసన లకు చెందిన ఇరు కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు అన్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫైట్స్ కు బాగా ఫ్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్తున్నారు. అందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. చైనాలో బాంబో ఫారెస్ట్ లో తీసిన ఆ ఫైట్ సినిమాకు ప్రాణమై నిలుస్తుందని అంటున్నారు. ఆ ఫైట్ కోసం చరణ్ డూప్ ని కూడా పెట్టుకోకుండా తానే నటించాడని,ఆరెంజ్ తర్వాత వస్తున్న ఈ చిత్రం తన కెరీర్ కి ప్లస్ అవ్వాలని భావిస్తున్నాడు.
ఇక మెగా సూపర్గుడ్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్సాయి ప్రత్యేకంగా ఓ సెట్ని తీర్చిదిద్దారు.మొదటి షెడ్యూల్ ని శ్రీలంకలో హీరో,హీరోయిన్స్ పై పాటను షూట్ చేసారు. వందశాతం మాస్ చిత్రమిదని,కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపించటంకోసం మియామి వెళ్ళి అక్కడ వర్కువుట్స్ చేసి వచ్చారు. చిరంజీవి నైంటీస్ లో వేసిన క్యారెక్టర్స్ తరహాలో ఈ మాస్ రోల్ ఉండబోతోందని వినికిడి.ఇక ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న కథ ప్రకారం తెలంగాణాలో ఓ ప్రాతం ప్లోరైడ్ వాటర్ కి ఎఫెక్ట్ అవుతుంది.అక్కడనుంచి వీడే చిత్రం టైపులో హీరో చేసే ప్రయత్నాలే కధాంశం అంటున్నారు.పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం చిరంజీవి ఎనభైల నాటి మాస్ సినిమాలా అలరిస్తుందంటున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.