Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లువారబ్బాయి రాజకీయ సంచలనం.. అంతలేదు, అందరిని ఫూల్స్ చేశాడు!
అల్లు శిరీష్ హీరోగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కు సరిపడే కథలు ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అల్లు శిరీష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'ఎబిసిడి'. ఎబిసిడి అనేది మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎబిసిడి.. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి దర్శత్వం వహిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా అల్లు శిరీష్ అందరిని ఫూల్స్ చేస్తూ సోషల్ మీడియాలో చిన్నపాటి అలజడినే సృష్టించాడు.
|
అల్లు శిరీష్ పొలిటికల్ ఇంటర్వ్యూ
అల్లు శిరీష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పట్టుమని 10 చిత్రాలు కూడా చేయలేదు. అప్పుడే రాజకీయాలు, రాజకీయ ఇంటర్వ్యూలు ఏంటని అంత షాక్ కి గురి కావడం సహజం. అలంటి షాకే శిరీష్ ట్విట్టర్ లో ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోనే బాగా పాపులర్ అయిన రాజకీయ ఇంటర్వ్యూకు నాకు ఆహ్వానం వచ్చింది. నేను ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నా అంటూ అల్లు శిరీష్ ట్విట్టర్ లో ప్రకటించి చిన్నపాటి సంచలనమే సృష్టించాడు.
ఫ్యాన్స్ అంతా అలా అనుకున్నారు
అల్లు శిరీష్ ట్విట్టర్ లో ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు వరుసగా కామెంట్స్ పెట్టారు. టివి 9 ఇంటర్వ్యూకి వెళుతున్నావా, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేనా, ఎన్టీవీ పాయింట్ బ్లాంక్ ఇంటర్వ్యూనా అభిమానులు కామెట్స్ పెడుతూ వచ్చారు. మరి కొందరైతే బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందా అని కూడా ప్రశ్నించారు. ఎన్నో రోజులుగా ఈ ఇంటర్వ్యూలో పాల్గొనాలని భావిస్తున్నా. ఇప్పటికి అవకాశం వచ్చింది. చాలా టెన్షన్ గా ఉంది అని కూడా అల్లు శిరీష్ కామెంట్ పెట్టాడు.
|
అందరూ ఫూల్స్ అయ్యేలా
కానీ తాను పాల్గొన్న ఇంటర్వ్యూ గురించి అసలు విషయం చెప్పిన అల్లు శిరీష్ అందరిని ఫూల్స్ చేశాడు. అల్లు శిరీష్ పాల్గొన్న ఇంటర్వ్యూ 'కాఫీ విత్ కిషోర్'. కాస్త కొత్తగా అనిపిస్తున్నా అల్లు శిరీష్ పాల్గొన్న ఇంటర్వ్యూ ఇదే. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి వెన్నెల కిషోర్. ఛానల్ పేరు 'థర్డ్ ఐ న్యూస్'. అసలు విషయం ఏంటంటే ఇది ఎబిసిడి చిత్రంలో భాగంగా వచ్చే ఫన్నీ సన్నివేశం. ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల జరిగింది. షూటింగ్ లొకేషనలోనే దృశ్యాలని అల్లు శిరీష్ అభిమానులతో పంచుకుంటూ తాను పాల్గొన్న ఇంటర్వ్యూ ఇదే అని రివీల్ చేశాడు.
మార్చిలో విడుదల
ఈ ఇంటర్వ్యూ ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో థియేటర్స్ లోకి వస్తుంది.. చూడండి అని ఎబిసిడి విడుదలని ప్రకటించాడు. వెన్నెల కిషోర్ గట్టిగానే ఇంటర్వ్యూ చేశాడు కానీ అతడిని మేము పిప్పి చేసేశాం అని అల్లు శిరీష్ ఈ ఫన్నీ సన్నివేశం గురించి వివరించాడు. అల్లు శిరీష్ చివరగా నటించిన ఒక్క క్షణం చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు అల్లువారబ్బాయి ఆశలన్నీ ఎబిసిడి పైనే ఉన్నాయి.