Don't Miss!
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
అల్లు శిరీష్ వివాదం...ఆధారాలు లభ్యం
హైదరాబాద్: ముగిసిపోయిందనుకున్న అల్లు శిరీష్ వివాదం ...మళ్లీ మొదటికి వచ్చింది. రాష్ట్ర రాజధానిలోని 'ఓవర్ ది మూన్' పబ్లో శనివారం అర్ధరాత్రి జరిగిన అల్లరికి సంబంధించిన ఫోటోలను బాధితురాలు పోలీసులకు అందజేశారు.
ఆ సమయంలో తామెవరు పబ్లో లేమని అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఇప్పటికే బహిరంగ ప్రకటన చేసినప్పటికీ.. ఆ ఫోటోల్లో హీరో అల్లు అర్జున్ సోదరుడు వెంకట్ కనిపిస్తున్నారు.
తనపై ముగ్గురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఢిల్లీకి చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ (34) శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. పబ్లో తనతోపాటు ఉన్న డీజే కెమెరా చిప్లోని ఫొటోలను ఆమె పోలీసులకు అందించారు.
ఇదిలా ఉంటే ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు, డీజే ఢిల్లీకి వెళ్లిపోయారని తెలిసింది. ఘటనకు సంబంధించి ఫొటోలు వెలుగు చూడటంతో.. సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయమై వెస్ట్జోన్ పరిధిలోని ఓ అధికారిని మీడియా వారు వివరణ కోరగా బాధితులు ఫొటోలు అందించిన మాట వాస్తవమేనన్నారు. ఇంత జరుగుతున్నా మహిళా ఫొటోగ్రాఫర్ పట్ల జరిగిన సంఘటనపై పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించకపోవడాన్ని బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.