Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లు శిరీష్ సినిమాకు ముహూర్తం ఖరారు!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి సినిమా రీమక్ లో అల్లు శిరీష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ బ్యానర్స్ లో మధుర శ్రీధర్, యష్ రంగినేని ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కన్నడ సంగీత దర్శకుడు జుడా శాండీ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
సంజీవ్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. గతంలో సంజీవ్ రెడ్డి మధుర శ్రీధర్ సినిమాలకు రచయితగా వర్క్ చెయ్యడం జరిగింది. తాజా సమాచారం మేరకు జూన్ 18న సినిమాను ప్రారంభించాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈ సినిమా.
అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది. మలయాళంలో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. గతంలో ఈ చిత్రాన్ని తెలుగులో కొంత మంది యువ హీరోలు రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికి చివరికి అల్లు శిరీష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో భావోద్వేగాలతో కూడిన సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి.