Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లు శిరీష్ 'గౌరవం' ఆడియో ఎప్పుడంటే..
హైదరాబాద్ : తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న అల్లు శిరీష్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం 'గౌరవం'. ఈ చిత్రం ఆడియో పంక్షన్ ని గ్రాండ్ గా ఏప్రియల్ 5 న విడుదల చేస్తున్నారు. అలాగే ఏప్రియల్ 19న చిత్రం విడుదల కానుంది. ప్రకాష్ రాజ్ తన డ్యూయిట్ మూవీస్ బ్యానర్ పై తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. పరువు హత్యలు నేపధ్యంలో చిత్రం రూపొందుతోంది.
ఇక రీసెంట్ గా తమిళ వెర్షన్కు సిబిఎఫ్సి 'యు' సర్టిఫికెట్ను అందించింది. తెలుగు వెర్షన్కి ఇంకా ఇంకా సెన్సార్ పత్రం రావలసి ఉంది. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజ్ కూడా తన ట్విటర్ అకౌంట్లో తెలియజేశారు. గౌరవం తమిళ వెర్షన్కి క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిందని, తెలుగు వెర్షన్ సెన్సార్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
'గగనం, ఆకాశమంత వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు దర్శకత్వ వహించిన రాధామోహన్ దర్శకత్వంలో రూపొందటంతో చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. విక్కీ డోనర్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ అల్లు శిరీష్తో జోడీ కట్టింది. ఈ సినిమా సామాజిక స్పృహ కలిగిన మంచి కథాంశంతో రూపొందుతోంది. దర్శకుడు రాధా మోహన్ తను చెప్పాలనుకున్న పాయింట్ ను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారని' తెలిపారు.
దర్శకుడు రాధామోహన్ మాట్లాడుతూ...ఒక మంచి కథకి, మంచి నటీనటులు సమకూరితే ఆ చిత్రం ఎలా ఉంటుందో మా గౌరవం కూడా అదే రేంజిలో ఉండబోతోంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే హైలెట్గా నిలవబోతోంది. మేము ఎంచుకున్న కాన్సెప్ట్ గౌరవం చిత్రానికి బాగా ప్లస్సవుతుంది. అల్లు శిరీష్, యామి గౌతమ్, ప్రకాష్ రాజ్, నాజర్ వారి పాత్రల్లో ఇమిడిపోయారు. తమన్ సంగీతం వైవిద్యంగా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
రాధామోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ పరిచయమవుతుండగా, యామి గౌతమ్, రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. డ్యూయెట్ మూవీస్ పతాకంపై రాజ్ నిర్మించే ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ బాణీలు అందించారు.