Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు శిరీషే గొడవను పెద్దది చేసాడు
మీ సొల్లు ఫ్యాన్స్ ఒక్కొక్కడికీ రిప్లై ఇచ్చుకునే టైమ్,ఓపిక నాకు లేదు.దమ్ముంటే మీ ప్రొడ్యూసర్ ని కాల్ చేసి మీడియా దగ్గరకు రమ్మనండి. నేను అక్కడికి వస్తాను. ఏరియా బై ఏరియా,టౌన్ బై టౌన్ బ్రేక్ తో వస్తా. అక్కడ ఒకే సారి తేలుద్దాం,అందరికీ ఒక్కసారే.రెడీ అంటే చెప్పు, అంటూ అల్లు శిరీష్ రీసెంట్ గా ట్విట్టర్ లో ఛాలెంజ్ విసిరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడదే అంతటా చర్చగా మారింది.
దూకుడు,మగధీర ల మధ్య జరిగిన గొడవ దూకుడు నిర్మాత దిగి వచ్చి మగధీర చిత్రాన్నే ఎక్కువ మంది చూసారు అని తేల్చి చెప్పటంతో ఆగింది. ఇక ఈ గొడవ ఆగటంతో సినిమా పెద్దలు ఈ గొడవకు మూల కారణం నుంచి,ఎలా పెరిగి పెద్దదైంది వరకూ పరిశీలిస్తున్నారు. మరో సారి ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు.ఈ క్రమంలో వారికి దూకుడు గొడవను పెంచి పెద్దది చేసింది మాత్రం అల్లు శిరీష్ ట్విట్టర్ స్టేట్ మెంట్సే అని తేలింది. మహేష్ ఫ్యాన్స్ ఆవేశంగా అడిగే వాటికి అంతకన్నా ఆవేశంగా వారిని లెక్క చేయకుండా సొల్లు ఫ్యాన్స్ అంటూ అల్లు శిరీష్ ట్వీట్స్ చేస్తూ సమాధాన మిచ్చాడు.
ఒకానొక స్టేజిలో దమ్ముంటే పబ్లిక్ గా వచ్చి నిర్మాతను కూర్చుని మాట్లాడమను అంటూ ఛాలెంజ్ లు సైతం చేసాడు. ఇవన్నీ మెగా ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని రప్పిస్తే మహేష్ ప్యాన్స్ ను మండించాయి. అస్సలే కాకమీదున్న మహేష్ ఫ్యాన్స్ దాంతో మరింత రెచ్చిపోయి కోటి రూపాయలు ఇస్తాం..మా కలెక్షన్స్ కన్నా మగధీర కలెక్షన్స్ గొప్పవని తేలిస్తే అని ఛాలెంజ్ లు వదిలారు. ఇక గతంలోనూ ట్విట్టర్ రాతల ద్వారా అల్లు శిరీష్ అందరి దృష్టిలో పడ్డాడు.
ముఖ్యంగా దూకుడు నిర్మాతని ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం రమ్మను..ఫేస్ బుక్క్ ల్లో రాయటం కాదు అని ఛాలెంజ్ చేయటం మంచి పద్దతి కాదంటున్నారు. అయితే అల్లు శిరీష్ మాత్రం వీరి మాటలు ఏమీ పట్టించుకునేటట్లు లేడు. తన పనిలో తాను ఉన్నాడు. మరో కాంట్రావర్శీతో కలుద్దాం అన్నట్లుగా ట్వీట్స్ రాస్తూనే ఉన్నాడు.