Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
కడుపుబ్బా నవ్వించేలా అల్లు శిరీష్ చిత్రం
హైదరాబాద్ : గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'కొత్తజంట'. రెజీనా హీరోయిన్. మారుతి దర్శకత్వం వహిస్తారు. బన్నివాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. ఈ చిత్రం మే 11న ప్రారంభం అవుతుంది. బస్ స్టాప్, ఈ రోజుల్లో చిత్రాలతో ఇప్పటికే మారుతి దర్శకుడుగా చాలా పాపులర్. ఈ చిత్రంతో ఆయన పెద్ద దర్శకుల లిస్ట్ లోకి ఎక్కనున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''శిరీష్ హావభావాలకు తగిన కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. కొత్తజంటగా శిరీష్, రెజీనా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తారు. నా మూడో చిత్రమే గీతా ఆర్ట్స్ సంస్థలో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది''అన్నారు.
''చాలా మంచి కథ ఇది. శిరీష్ని తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మారుతి. ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్.
యూత్ కామెడీ రెడీ చేసిన స్క్ర్రిప్ట్ ని మారుతి వినిపిస్తే వెంటనే అల్లు అరవింద్ ఓకే చేసినట్లు వినపడుతోంది. అయితే మారుతి..గత చిత్రాలలో బూతు బాగా దిట్టించి వదలటం వల్లనే హిట్ సాధించారనే విమర్శ ఉంది. ఈ చిత్రంతో అయినా రెగ్యులర్ రూట్ లోకి వచ్చి క్లీన్ చిత్రాన్ని అందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రెజీనా హీరోయిన్ గా చేస్తోంది.
'గౌరవం' విషయానికి వస్తే...ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ నిర్మాతగా రాధామోహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'గౌరవం'. ఈ చిత్రం శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన విధంగా విజయం సాధించలేదు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లోనూ వర్కవుట్ కాలేదు.