twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సొల్లు' అంటూ మహేష్ ఫ్యాన్స్ పై అల్లు శిరీష్..

    By Srikanya
    |

    మీ సొల్లు ఫ్యాన్స్ ఒక్కొక్కడికీ రిప్లై ఇచ్చుకునే టైమ్, ఓపిక నాకు లేదు. దమ్ముంటే మీ ప్రొడ్యూసర్ ని కాల్ చేసి మీడియా దగ్గరకు రమ్మనండి. నేను అక్కడికి వస్తాను. ఏరియా బై ఏరియా, టౌన్ బై టౌన్ బ్రేక్ తో వస్తా. అక్కడ ఒకే సారి తేలుద్దాం, అందరికీ ఒక్కసారే. రెడీ అంటే చెప్పు, అంటూ అల్లు శిరీష్ ఛాలెంజ్ ట్విట్టర్ లో విసిరారు. మహేష్ ఫ్యాన్స్ కు ఆయన దూకుడు విషయంలో సమాధానం ఇస్తూ విసిగిపోయి ఇలా చెప్పినట్లు భావం వ్యక్తమవుతోంది. దూకుడు, మగధీర మధ్య జరుగుతున్న వివాదం ఇలా ట్విట్టర్ లో తీవ్ర రూపం దాల్చింది. దూకుడు యాభై రోజుల ఫంక్షన్ విజయవాడలో జరిపిన దగ్గరనుంచీ ఈ వివాదం మొదలైంది. చిరు అభిమానులు దూకుడు రికార్డులు పేక్ అంటూ మగధీర రికార్డులను బ్రేక్ చేయలేదంటూ ప్లేక్సీలు కట్టారు.

    అంతేగాక దూకుడు రికార్డులు బ్రద్దలు చేసిందని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని ఛాలెంజ్ చేసారు. దానకి ప్రతిగా మహేష్ అభిమానులు తాము దూకుడు రికార్డులకు కట్టుబడి ఉన్నామని, తమవి ఫేక్ రికార్డులని రుజువు చేస్తే కోటి రూపాయలు ఇస్తామని ప్రతి సవాల్ విసిరారు. ఈ సవాళ్ళు నేపధ్యంలో అల్లు శిరీర్ ఇలా డైరక్ట్ గా ఫ్యాన్స్ పై ఎటాక్ కి దిగారు. మరో ప్రక్క రామ్ చరణ్ కూడా చాలా డిప్లమాటిక్ గా ట్విట్టర్ లో కామెంట్ చేసి ఈ గొడవను పెద్దది చేసారు.

    English summary
    "Mi sollu fans okkokadiki reply icchukune time/opika naku ledu. Dhammunte call your Producer to media. I will also come...Area by area, town by town break tho vasta (with DCRs). Akkada oke sare telchukundam, once in for all. Ready ante cheppu! ," said Allu Sirish.-Allu Sirish
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X