Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
మెగా జెండా అన్ని రాష్ట్రాల్లో ఎగరవేస్తారట...
Recommended Video
'ఒక్క క్షణం' సినిమా ద్వారా డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ ఇటీవల మెగా అభిమానులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యాన్ బేస్ ఇతర రాష్ట్రాలకు విస్తరింప చేసే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.
ఇప్పటి వరకు తెలుగులోనే, ఇకపై అలా కాదు
ఈ తరం మెగా ఫ్యామిలీ హీరోలమంతా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయ్యాం. రాబోయే రోజుల్లో చరణ్, బన్నీ, వరుణ్, నేను ఇలా మెగా హీరోలమంతా బయటి రాష్ట్రాల్లో మన ఫ్యాన్ బేస్ పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అల్లు శిరీష్ తెలిపారు.
మెగా జెండా ఎగరవేస్తాం
ఆల్రెడీ కేరళలో మనకు మంచి పట్టుంది. ఒరిస్సాలో ఎప్పటి నుండో ఉంది. కర్నాటకలోనూ మెగా అభిమానులు ఉన్నారు. తమిళ సినిమాలు కూడా చేసి అక్కడ కూడా మెగా జెండా గట్టిగా ఎగరవేస్తాం. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తామని శిరీష్ తెలిపారు.
ఫ్యాన్స్ తలెత్తుకునేలా చేస్తాం
మీరిచ్చే అభిమానాన్ని ఎప్పుడూ హక్కుగా భావించలేదు. దాన్నొక బాధ్యతగానే తీసుకున్నాం. ఫ్యాన్స్ గర్వపడేలా సినిమాలు చేయడమే మెగా హీరోల ప్రధాన లక్ష్యమని, వారు తలెత్తుకునే సినిమాలు చేస్తామని అల్లు శిరీష్ తెలిపారు.
మెగా అభిమానులు లేకుండా మేము లేము
మెగా అభిమానులు లేకుండా మేము లేమని, గత 30 ఏళ్లుగా చిరంజీవి గారి దగ్గర నుండి మొదలైతే కళ్యాణ్ గారు, బన్నీ, చరణ్, తేజ్, వరుణ్, నేను, నిహారిక వరకు ప్రతి ఒక్కరినీ మీ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి ప్రతి అడుగులోనూ సపోర్టుగా ఉన్నారు. సినిమాల పరంగానే కాదు, మేము చేసే సోషల్ యాక్టివిటీస్లోనూ మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని శిరీష్ అన్నారు.
ఒక్క క్షణం
అల్లు శిరీష్, సురభి జంటగా.... 'ఎక్కడికి పోతావు' చిన్నవాడా లాంటి హిట్ అందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒక్క క్షణం'. లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ట్రైలర్ విడుదల కాగా 1 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. సినిమాపై మంచి అంచనాలున్నాయి.