Don't Miss!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- News మోడీ సభకు ఆటంకాలపై కేంద్రం గుర్రు ? పల్నాడు ఎస్పీపై వేటుకు..!
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
శిరీష్ హీరో అనగానే షాకయ్యాం: రామ్చరణ్
హైదరాబాద్ : శిరీష్ హీరో అవుతున్నాడనగానే... మా కుటుంబం మొత్తం కాసేపు షాకయ్యాం. ఎందుకంటే.. తను హీరో అవుతాడని మేం అనుకోలేదు అంటున్నారు రామ్ చరణ్ తేజ. శిరీష్, యామి గౌతమ్ జంటగా నటించిన చిత్రం 'గౌరవం'. రాధామోహన్ దర్శకత్వం వహించారు. ప్రకాష్రాజ్ నిర్మాత. 'గౌరవం' ప్రచార చిత్రాలను హీరో రామ్చరణ్ ఉగాది పర్వదినాన గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ''శిరీష్ నటిస్తున్నాడని తెలియగానే ఆశ్చర్యపోయా. నిర్మాతగా మారి గీతా ఆర్ట్స్ని మరో స్థాయికి తీసుకెళ్తాడనుకొన్నా. డాడీకి ఏమైనా సలహాలు కావాలంటే అరవింద్ గారిని అడుగుతారు. నేను.. శిరీష్ని సంప్రదిస్తా. శిరీష్ చాలా బాగా ఆలోచిస్తాడు. మంచి నిర్ణయాలు తీసుకొంటాడు. ఈ నిర్ణయం కూడా తప్పు కాదు. మా కుటుంబం నుంచి మరో హీరో రావడం ఆనందంగా ఉంది. ప్రకాష్రాజ్ ఎంచుకొనే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. అందులో గౌరవం కూడా ఒకటి కావాలని ఆశిస్తున్నా'' అన్నారు.
ఇక శిరీష్ చిత్రం గురించి చెబుతూ ''చరణ్, బన్నీలను చూస్తే.. సినిమాల్లోకి రావడానికి ఎంత కష్టపడాలో అర్థమవుతుంది. సినిమా అంతటినీ భుజాలపై మోసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. అందుకే చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నా. 'గౌరవం అనేది పుట్టుకతో రాదు.. ప్రవర్తనతో వస్తుంది' అని చెప్పడమే ఈ సినిమా కథ'' అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ... ''బన్నీ మొదటి సినిమా 'గంగోత్రి' కోసం కథ నేనే విన్నా. రాఘవేంద్రరావుగారి వందో సినిమా కాబట్టి.. ఆయన కచ్చితంగా బాగా చేస్తారనే నమ్మకంతో, రిస్కు తక్కువ అనే ఉద్దేశంతో ఆ కథని ఎంచుకొన్నాం. అయితే శిరీష్ అలా కాదు.. ఈ కథ ముందు తనే విన్నాడు. ఆ తరవాతే నా దగ్గరకి వచ్చాడు''అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ''తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించాం. రెండు భాషలూ శిరీష్కి తెలుసు కాబట్టి.. కథని చక్కగా అర్థం చేసుకొన్నాడు''అన్నారు. మెసేజ్తో కూడిన ఎంటర్టైన్మెంట్ చిత్రమని యామి అన్నారు. కార్యక్రమంలో చిన్నికృష్ణ, యామి గౌతమ్, బీవీఎస్ రవి, దిల్ రాజు, బండ్ల గణేష్ పాల్గొన్నారు.