Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సెట్స్పై ఇద్దరు మెగాస్టార్లతో అల్లు వారబ్బాయి.. షాకింగ్ లుక్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ కలిసి నటించిన కొత్త సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి నటించగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయింది. కానీ తాజాగా ఈ సినిమా సెట్స్పై ఆ ఇద్దరి నడుమ అల్లు వారబ్బాయి ఉన్న ఓ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Recommended Video
అటు చిరు ఇటు అమితాబ్
టాలీవుడ్, బాలీవుడ్ ఐకాన్స్ ఇద్దరూ చెరో పక్క నిల్చోగా మధ్యలో అల్లు శిరీష్ నిల్చొని ఫోటోకి పోజిచ్చాడు. అయితే ఈ పిక్లో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లుక్లో, అదే విధంగా అమితాబ్ బచ్చన్ పూర్తి గడ్డంతో సైరా సినిమాలోని వేషాధారణతో కనిపించడంతో వెంటనే వైరల్గా మారింది. సరదాగా సెట్స్పై అల్లు శిరీష్ ఈ ఫోటో దిగాడని సమాచారం.
కనీవినీ ఎరుగని రీతిలో ‘సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్... చీఫ్గెస్ట్ ఎవరో తెలుసా?
విడుదలకు ముందే సైరా సెన్సేషన్
చిరంజీవి మెగా ప్రాజెక్టు 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. దేశంలోని అన్ని భాషా చిత్రాల పరిశ్రమలు ఈ భారీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాయి.
భారీ తారాగణం.. మెగాస్టార్ ఇంట్రెస్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన 'సైరా నరసింహా రెడ్డి' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిరంజీవి సహా రామ్ చరణ్ ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారని తెలిసింది. చారిత్రాత్మక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. తమన్నా, కుచ్చ సుదీప్, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
చిరంజీవి కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'సైరా నరసింహా రెడ్డి' కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం విశేషం.