twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ వెళ్ళి బన్నీ వచ్చె

    By Staff
    |

    allu arjun
    గమ్యం చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ క్రిష్ ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కృష్ణం వందే జగద్గురం చిత్రాన్ని ప్లాన్ చేసారన్న సంగతి తెలిసిందే. అయితే అనేకానేక కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో వెంకి ప్లేస్ లోకి అల్లు అర్జున్ వచ్చారని సమాచారం. ఆ స్క్రిప్టునే కొద్దిగా మార్చి బన్నీ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా మార్చారని వినపడుతోంది. అయితే కొందరు కృష్ణం వందే జగద్గురం స్క్రిప్టు ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ లో పరిశీలనలో ఉందని,అది వేరు ఇది వేరుని అంటున్నారు.

    ఇక ఈ వేదం చిత్రంలో బన్నీతో పాటు మంచు మనోజ్ నటించనున్నారు. అనూష్క మరో లీడ్ రోల్ లో కన్పించనుంది. యువతకు సందేశమిస్తూ ఎంటర్టైన్ మెంట్ తో సాగే విధంగా ఉంటుందని స్క్రిప్టు రూపొందించారని సమాచారం. జూన్ ఏడున ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని ఆర్కా బ్యానర్ పై దేవినేని ప్రసాద్,శోభు యార్లగడ్డ నిర్మించనున్నారని తెలుస్తోంది.

    అక ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సారధ్యంలో మ్యూజికల్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సీతారామశాస్త్రి,ఇ.యస్.మూర్తి పాటలు రాస్తున్న ఈ చిత్రానికి జనశేఖర్ (హౌస్ ఫుల్ ఫేమ్)కెమెరామెన్ గా పనిచేయనున్నారు. గమ్యం చిత్రం లాగే ఈ వేదం కూడా సంచలనం సృష్టిస్తుందని ఆశిద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X