అమలతో రచ్చ చేసిన రామ్ చరణ్..!?
'ఆరెంజ్" తర్వాత చరణ్ చేస్తోన్న సినిమా 'రచ్చ". తమన్నా హీరోయిన్...దర్శకుడు సంపత్ నంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అమలా పాల్ (నాన్నఫేం)పేరును హీరో చరణ్ ప్రతిపాదించాడట. ఈ విషయమై ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి కన్ ఫర్మేషన్ లేకపోయినప్పటికీ, 'రచ్చ" సినిమాలో అమలాపాల్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వనుందంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
'నాన్న" సినిమాలో తన క్యూట్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకున్న అమలాపాపల్, నాగచైతన్యతో ఓ సినిమా చేయనుంది. దానికన్నా ముందే విడుదల కానున్న 'రచ్చ"లో అతిథి పాత్రకు దాదాపు ఖాయమపోయింది. ఇక సిద్ధార్థతో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే..టాలీవుడ్ లో పలువురు యువ హీరోల మనసు దోచేసిందట. ఆమె గ్లామర్ అలాంటిది మరి..అంటూ అమలాపాల్ టాలీవుడ్ లో దూసుకుపోనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ లో చాలామంది.


Click it and Unblock the Notifications











