Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అందులో చేయమని అడిగారు.. కానీ, భర్తతో వివాదం కారణంగా..
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి పేరును తెచ్చుకుంది అమలా పాల్. అయితే, ఆమె చేసిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో టాలీవుడ్కు తాత్కాలికంగా బైబై చెప్పేసింది. ఆ తర్వాత దక్షిణాదిలోని ఇతర భాషల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'ఆమె'. తమిళంలో 'అడై' పేరుతో వస్తున్న ఈ సినిమాను రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. దీంతో ఈ సినిమాపై రెండు భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి.
సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కోసం అమలా పాల్ హైదరాబాద్లో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అంశాలను వెల్లడించడంతో పాటు తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంది. ఇందులో భాగంగానే గతంలో తాను ఓ భారీ సినిమాను వదులుకున్నానని, దానికి కుటుంబ వివాదాలే కారణమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఓ చానెల్తో మాట్లాడుతూ.. ''తెలుగులో తనదైన శైలితో నటించి ఎంతో గుర్తింపును తెచ్చుకున్న నటి సావిత్రి. ఆమె బయోపిక్ మూవీ 'మహానటి' కోసం మొదట నన్నే అడిగారు. ఈ సినిమా కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ నాతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే, అప్పుడు కుటుంబ వివాదాలతో నేను ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణంగా సినిమా చేయలేనని చెప్పాను. దీంతో నా స్థానంలో కీర్తీ సురేష్ను తీసుకున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది'' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
అమలా పాల్ నటించిన 'ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది.