Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సెక్సీ బ్యూటీకి వెంకీ, నాగ్ ఇద్దరూ ఫిదా అయ్యారుగా..మూడేళ్ళ తరువాత ఆమె మెరుపులు!
అనేక వివాదాలు, మూడేళ్ళ గ్యాప్ తరువాత అమలాపాల్ ఎట్టకేలకు తెలుగులో నటించడానికి సిద్ధం అవుతోంది.అమలాపాల్ తెలుగులో నటించిన చివరి చిత్రం జెండాపై కపిరాజు. ఈ చిత్రం తరువాత అమల తెలుగులో తిరిగి నటించలేదు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా తెలుగులో మూడేళ్ళ పాటు ఒక సినిమా కూడా చేయని అమలాపాల్ కు ఇప్పుడు ఏకంగా రెండు క్రేజీ మూవీస్ లో ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ ఎఫ్2 అనే చిత్రంలో నటిచడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. మల్టి స్టారర్ చిత్రంగా రూపొందే ఈ చిత్రంలో మరో హీరోగా వరుణ్ తేజ్ నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం వెంకీకి జోడిగా అమలాపాల్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
నాగార్జున, నాని లతో మరో మల్టీస్టారర్ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా హీరోయిన్ గా అమలాపాల్ నే అనుకుంటున్నారట. ఈ రెండు మల్టి స్టారర్ చిత్రాలపై అభిమానుల్లో ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.ఈ క్రేజీ మూవీస్ లో అమల ఛాన్స్ దక్కించుకుంది. దీనిపై రెండు చిత్రాల యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావలసిఉంది.