Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఆ విషయంలో... రజనీ 'కబాలి' రికార్డ్ ని బ్రద్దలు కొట్టాడీ కుర్ర హీరో
కబాలి తర్వాత ఎయిర్ ఏషియా ప్లైట్ పైకి మళయాళ చిత్రం పోస్టర్ ఎక్కింది
హైదరాబాద్ :తమిళ సూపర్ స్టార్ తలైవా నటించిన సెన్సేషనల్ మూవీ కబాలి రిలీజ్ ముందు ఎన్ని ప్రభంజనాలు సృష్టిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా పబ్లిసిటీ విషయంలో ఈ చిత్రం కొత్త పుంతలు తొక్కింది. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్ధ ఎయిర్ ఏషియా తమ విమానాలపై కబాలి పోస్టర్స్ని ఏర్పాటు చేసి రజనీపై తమ అభిమానాన్ని చాటుకోవటం అప్పట్లో హైలెట్ అయ్యింది.
ఇండియన్ హిస్టరీలో తొలిసారి ఇలా సినిమా పోస్టర్స్ ఫ్లైట్ పైకి ఎక్కగా దీనికోసం దాదాపు 300 పైబడి టెక్నీషియన్స్ పనిచేశారు. 200 గంటలు ఎంతో డెడికేషన్తో ఈ వర్క్ పూర్తి చేశారు. అయితే ఇది కేవలం ఒకే ఒక్క మనిషి రజనీకాంత్పైన లవ్తోనే అని చెప్పడం విశేషం. అయితే ఇప్పుడు మరోసారి ఆ రికార్డ్ ని బ్రద్దలు కొట్టాడు మళయాళ హీరో వినీత్ శ్రీనివాసన్.
వినీత్ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ఎబే అనే మళయాళ చిత్రం ఫిబ్రవరి 23 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ని పెంచారు. ఒక్కసారిగా జనం మాట్లాడుకునేందుకు కబాలి రూట్ లో వెళ్లి ...ఎయిర్ ఏషియా విమానాలపై పోస్టర్ వేసారు. ఈ విషయాన్ని వినీత్ స్వయంగా తెలియచేసారు.
ఇంతకీ నిర్మాతలు ఇలా ఎయర్ ఆశియాని ఎప్రోచ్ అవటానికి కారణం..కేవలం పబ్లిసిటీ కోసమే అనే కాక తమ కథలో హీరో ..సొంతంగా ఏరో ప్లేన్ తయారు చేసుకుని ఎగరాలని ప్రయత్నించే కుర్రాడి కథ కాబట్టే అలా చేయటం జరిగిందంటున్నారు. ఎలా అయితేనేం ఈ చిత్రం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.