Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ప్రభాస్ సినిమా దెబ్బేసేసింది.. ‘సైరా’ ఫలితంపై టెన్షన్ పడుతున్న బడా సంస్థ
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. 'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. తాజాగా 'సైరా' విషయంలో ఓ బడా సంస్థ తెగ టెన్షన్ పడిపోతోందట. వివరాల్లోకి వెళ్తే..
ఎన్నో అంచనాలు.. ఫలితం మాత్రం ఇలా
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి సరైన హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కానీ, కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఒక్క తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో ‘సైరా' అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
మరీ ఇంత మొత్తమా..?
‘సైరా: నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం, ఏపీలో రూ.107.4 కోట్లు, కర్ణాటకలో రూ.27 కోట్లు, తమిళనాడులో రూ.7.6 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు, మిగితా దేశాల్లో రూ.27.5 కోట్లు, ఓవర్సీస్లో రూ.20 కోట్లు పలికింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.152.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. అయితే, ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ రూ.133 కోట్ల వద్ద ఆగిపోవడంతో దాదాపు రూ. 20 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు.
అక్కడ కూడా విడుదలైంది
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ‘సైరా'పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు.. సైరా డిజిటల్ మీడియా పార్టనర్ అయిన అమెజాన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్ట్రీమింగ్ నవంబర్ 20న ప్రారంభం అయింది. దీంతో చాలా మంది ఈ డిజిటల్ మీడియాలో సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రభాస్ సినిమా నిరాశనే మిగిల్చింది
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమా ఇటీవలే అమెజాన్లో విడుదలైంది. అయితే, దీనికి ఇక్కడ కూడా మంచి స్పందన రాలేదు. దీంతో సంస్థకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Recommended Video
సైరా గురించి టెన్షన్
‘సైరా: నరసింహారెడ్డి' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను అమెజాన్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. దీంతో చాలా మంది ఈ సినిమాను వీక్షించేందుకు క్లిక్స్ చేస్తున్నారని తాజాగా ఆ సంస్థ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, వీకెండ్ అయిన శనివారం కూడా స్పందన బాగానే ఉందట. మరి ఇది లాంగ్ రన్లో ఎలా ఉంటుందోనని సంస్థ ప్రతినిధులు టెన్షన్ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.