Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీనియర్ హీరో అనారోగ్యం...కంగారు పడొద్దని ప్రకటన
ప్రస్తుతం అంబికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస.. ద్రవరూపంలో ఆహారాన్ని అందిస్తున్నారు. మరో 48 గంటల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం వరకు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తామని వైద్యుడు సతీష్ తెలిపారు. ముందుజాగ్రత్తగానే ఇలా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా శుక్రవారం రాత్రి 8.45 గంటల సమయంలో అంబరీష్ ఇక్కడి విక్రమ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆయన అంబరీష్ చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ''అంబరీష్ అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని వైద్యులు చెప్పారు. రెండ్రోజుల్లో తేరుకుంటారు'' అని వెల్లడించారు. శనివారం ఉదయాన్నే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రిని సందర్శించారు. తాను వెళ్లినప్పుడు నిద్రిస్తున్నందున మాట్లాడేందుకు వీలుకాలేదని అన్నారు. క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు.
అంబరీష్ అనారోగ్యానికి గురైన సమాచారం దావాలనంలా వ్యాపించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు బెంగళూరుకు తరలివచ్చారు. ఆరోగ్యశాఖ మంత్రి యు.టి.ఖాదర్, మండ్య ఎమ్పీ రమ్య, సీనియర్ నాయకుడు ఎం.సి.నాణయ్య, చిత్రపరిశ్రమకు చెందిన హెచ్.డి.గంగరాజు, రాక్లైన్ వెంకటేష్ తదితరులు శుక్రవారం రాత్రే ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. లోనికి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో కార్డియాక్ కేర్ యూనిట్ (సిసియూ) వెలుపలి నుంచే అంబరీష్ను చూసి వెనుతిరగాల్సి వచ్చింది. ప్రముఖ నటులు రవిచంద్రన్, శివరాజ్కుమార్, సీనియర్ నటి లీలావతి, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆసుపత్రిని సందర్శించారు.