ఆంటీ వయసు మీరింది.. కళ్ల కింద క్యారీ బ్యాగులు.. పవన్ హీరోయిన్కు నెటిజన్ల చుక్కలు
పవర్స్టార్ పవన్ కల్యాణ్ సరసన బద్రీ చిత్రంలో ఆకట్టుకొన్న అమీషా పటేల్ గుర్తుండే ఉంటుంది. ఇటీవల బెడ్రూంలో దుప్పటి కప్పుకొని అర్ధనగ్నంగా ఫొజిచ్చిన విషయం తెలిసిందే. హాట్హాట్గా ఉన్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలపై దారుణమైన కామెంట్లు పెడుతూ ఈ అందాల భామకు సోషల్ మీడియాలో నెటిజన్లు చుక్కలు చూపించారు. అమీషాపై నెటిజన్లు విసిరిన వ్యంగ్యాస్త్రాలు ఇవే..
Recommended Video


కళ్ల కింద క్యారీ బ్యాగులు
హాట్హాట్ ఫొటోలపై అమీషా పటేల్ సమాధానమిస్తూ.. నీవు ఇక తెరమరుగైన హీరోయిన్వి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అలాగే ఆంటీ.. నీ కళ్ల కింద ముడుతలు ఉన్నాయి చూసుకో అంటూ మరోకరు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఇంతకంటే ఏం చేయగలవు
అమీషా ఫోటోలను ఉద్దేశించి.. ఇక ఇదే తక్కువ. ఇంతకంటే ఏమి చేయగలవు. ఒక ఇలానే నీ అందాలను చూపించుకోవాల్సిందే అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. నీవు ఇలా ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదంటూ మరోకరు కామెంట్ చేశారు.

వయసు మీరింది.. ఆంటీ
అమీషా పటేల్ వయసు అయిపోయింది. అందుకే అందర్ని దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నది. అంతకుమించి ఏమిలేదు అని ఓ వ్యక్తి కామెంట్ విసిరాడు. మరోకరు నాకు లిప్ టూ లిప్ కిస్ కావాలి ఇస్తావా అని అడిగాడు.

అవకాశాలు సన్నగిల్లడంతో
బద్రీ సమయంలో హిందీలో హృతిక్ రోషన్తో కహో నా ప్యార్ హై అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్కు చెక్కేసింది. సన్నీ డియోల్తో గదర్ ఏక్ ప్రేమ్ కహానీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అవకాశాలు సన్నగిళ్లడంతో కనుమరుగైపోయింది.

నిర్మాతగా మారిన అమీషా పటేల్
బాలీవుడ్ తెరకు దూరం కావడం, అవకాశాలు లేకపోవడంతో స్వయంగా అమీషా నిర్మాతగా మారి దేశీ మ్యాజిక్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత సన్నిడియోల్తో కలిసి భయ్యాజి సూపర్హిట్ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం విడుదల సమస్యలు ఎదుర్కొంటున్నది.


Click it and Unblock the Notifications











