Don't Miss!
- News జగన్ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలకు ఎన్డీయే కూటమి సవాల్ ఇలా..!
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Sports Kavya Maran: తిలక్ వర్మ..నీకు దండంరా బాబు! video
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న పవన్ హీరోయిన్!
షిమ్లా: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరియమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. తాజాగా ఈ భామ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. హీమీర్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాజిందర్ సింగ్ రాణా తరుపున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
బిజేపీ పార్టీ రెండు సార్లు విజయం సాధించిన ఈ నియోజకవర్గం నుండి తొలిసారిగా పోటీ చేస్తున్నారు రాజిందర్ సింగ్ రాణా. దీంతో అతన్ని గెలిపించేందుకు తన చేతనైన సాయం చేస్తోంది అమీషా పటేల్. తదనైన రీతిలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తూ ఆకట్టుకుంటోంది అమీషా పటేల్.
2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'కహోనా ప్యార్ హై' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అమీషా పటేల్ ఆ చిత్రం విజయంతో లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే తర్వాత ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం పరాజయం పాలవ్వడంతో అమీషాకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. మెయిన్ హీరోయిన్గా అమీషా కెరీర్ ఎప్పుడో ముగిసింది.
ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్, ఇతర క్రింది స్థాయి పాత్రలు చేస్తూ నెట్టుకొస్తోంది అమీషా. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రన్ బోలా రన్, భయ్యాజీ సూపర్ హిట్, దేశి మ్యాజిక్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. 37 ఏళ్ల అమీషా పటేల్ ఇప్పటికీ పెళ్లి చేసుకుండానే ఒంటరి జీవితం సాగిస్తోంది.