Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా 'పవర్' ఏంటో చూపిస్తానంటున్న బాలకృష్ణ హీరోయిన్
పవన్ కళ్యాణ్ తో బద్రి, మహేష్ తో నాని చిత్రాలు చేసిన అమీషా పటేల్ తాజాగా బాలకృష్ణ సరసన పరమవీర చక్ర చిత్రంలో చేస్తోంది. అయితే తాజాగా ఆమెకు బాలీవుడ్ నుండి ఓ భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి రూపొందిస్తున్న 'పవర్' చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. భారీ బడ్జెట్ తో హేమా హేమీల్లాంటి నటుల (అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్)తో 'పవర్' చిత్రం రూపొందుతోంది. దాంతో అమీషా పటేల్ చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు బాలీవుడ్ నుంచి నిష్కమించాననుకున్న దశలో ఈ ఆఫర్ రావటం ఆమెకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని మీడియాకు చెప్తూ.."అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగన్ లాంటి మెగా హీరోలు నటిస్తుండటంతో 'పవర్' రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వారితో కలిసి నటించటంతో మన నటన తేలిపోతుందని అనుకుంటున్నాను! 'నేను ఏస్థాయిలో నటించాలి?' నా దర్శకుడికి చెడ్డ పేరు తీసుకురాకుండా చక్కగా నటిస్తానని అనుకుంటున్నాను. అలాగే నా నటనా పవర్ ఏమిటో చూపిస్తాను" అంది.