Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరోయిన్ అమీషా పటేల్ పారిస్లో వేశ్యగా...
పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ అమీషా పటేల్. గత కొంత కాలంగా అంతంత మాత్రంగానే సాగుతున్న అమీషా కెరీర్ ఈ సంవత్సరం కాస్త జోరందుకుంది. ఆమె చేతిలో ఇప్పడు దాదాపు నాలుగైదు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం అమీషా తన తర్వాతి చిత్రంలో వేశ్య పాత్రలో దర్శనం ఇవ్వబోతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమీషా...'పారిస్లో ఉండే హై ప్రొఫైల్ వేశ్య'పాత్రను పోషిస్తోంది. ఈ మేరకు పలువురు హై ప్రొఫైల్ వేశ్యలను కలుస్తూ వారి జీవితాలపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ పాత్రపై అమీషా మాట్లాడుతూ...''ఇలాంటి పాత్ర చేయడం నాకు మొదటి సారి, ఈ పాత్ర చేయడంపై నేను ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇక్కడ ఆసక్తి కర విషయం ఏమిటంటే ఈచిత్రానికి నిర్మాత కూడా అమీషానే. తను స్థాపించిన అమీషా పటేల్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇతర ప్రొడక్షన్స్ లోనే అమీషా రెచ్చిపోయి నటించింది. మరి సొంత బ్యానర్లో, అందులోనూ వేశ్య పాత్ర, అమీషా ఏ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుందో అని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. 2012 ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.