ప్రసాద్ ఐమాక్స్ లో ‘బుడ్డా’ ప్రీమియర్ షో కి అమితాబ్...!
పూరీ జగన్నాథ్ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో మారుమోగిపోతోంది. ఎవరి నోట విన్నా పూరీ తాజాగా రూపొందించిన బుడ్డా సినిమా గురించే. అమితాబ్ కి ఈ సినిమా మళ్లీ లైఫ్ ఇస్తుందనీ, అసలు ఆయనతో ఇలాంటి సినిమా తీయచ్చన్న ఐడియా పూరీకి ఎలా వచ్చిందంటూ అంతా చర్చించుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా పూరీని తెగ పొగిడేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు చూస్తామా… అని టాలీవుడ్ ప్రముఖులంతా క్యురియాజిటీతో ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు (గురువారం) ఈ సినిమా ప్రీమియర్ ను హైదరాబాదు ప్రసాద్ ఐమాక్స్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. రేపు రాత్రి పది గంటలకి మొత్తం ఐదు స్క్రీన్స్ మీద ఈ సినిమా ప్రిమియర్ వేస్తున్నారు. దీనికి ముంబై నుంచి ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ కూడా వస్తున్నాడు. ఇక టాలీవుడ్ సెలెబ్రిటీస్ అయితే చెప్పేక్కర్లేదు. చాలా మంది ఈ షోకి హాజరవుతారు. శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











