Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అతన్ని ఉరి తీయడంపై అమితాబ్ బచ్చన్ ఆనందం
డిసెంబర్ 13, 2001వ సంవత్సరంలో పార్లమెంటు పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారి అయిన అప్జల్ గురుకు 2002 డిసెంబర్ 18వ తేదీన ఢిల్లీ కోర్టు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు 2003 అక్టోబర్ 29వ తేదీన సమర్థించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా అతనికి ఉరిశిక్ష వేయడాన్ని సమర్థించింది. 2006 అక్టోబర్ 20వ తేదీన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండింది.
అయితే, అతని భార్య రాష్టపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో అది ఆగిపోయింది. ముంబై ఉగ్రవాదుల దాడి తర్వాత అఫ్జల్ గురును ఉరి తీయాలనే డిమాండ్ తీవ్రత పెరిగింది. 2011 ఆగస్టులో హోం మంత్రిత్వ శాఖకు మెర్సీ పిటిషన్ సిఫార్సును పంపించారు.
పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ముగిసిన తర్వాత అఫ్జల్ గురు ఫైల్ను పరిశీలిస్తానని 2012 డిసెంబర్ 10వ తేదీన హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 22వ తేదీన ముగిశాయి. అఫ్జల్ గురును ఉరి తీయాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2013 జనవరి 23వ తేదీన ఫైల్ చేరింది. ఆ సిఫార్సును ఆమోదిస్తూ రాష్ట్రపతి 2013 జనవరి 26వ తేదీన సంతకం చేశారు.