Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రాధికపై మెగాస్టార్ ప్రశంసలు
టాలీవుడ్, కోలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన రాధికా శరత్ కుమార్.. బుల్లితెరపై ఎన్నో సంచనాలను క్రియేట్ చేసింది. సీరియల్స్లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. వెండితెరపై ఎన్ని ప్రయోగాలు చేసిందో.. సీరియల్స్ ద్వారా బుల్లితెరపై కొత్తగా ట్రై చేస్తూ సక్సెస్ను అందుకుంది. తాజాగా మరో షోతో రాధికా అందర్నీ మెప్పించేందుకు వస్తోంది.
కౌన్ బనేగా కరోడ్ పతి..
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్కు మరో లైఫ్ ఇచ్చిన కేబీసీ (కౌన్ బనేగా కరోడ్ పతి) కార్యక్రమం దేశంలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బీ పని అయిపోయిందనుకున్న సమయంలో తిరిగి మునుపటి క్రేజ్ను తెచ్చిపెట్టిన ఈ షో.. క్షణం క్షణం ఉత్కంఠగా సాగేది. అయితే హిందీలో పాపులర్ అయిన ఈ షో మెల్లి మెల్లిగా అన్ని ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసింది.
తెలుగులో రెండు సీజన్లు..
తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో బాగానే ఆకట్టుకుంది. నాగార్జున మొదటి సీజన్ను నడిపించగా.. మెగాస్టార్ చిరంజీవి రెండో సీజన్ను కొనసాగించాడు. అయితే మూడో సీజన్ గురించి మరో ఊసే ఎత్తలేదు. స్టార్ మా బృందం ఆ దిశగా ఆలోచించినట్టుగా కూడా కనిపించలేదు.
|
తాజాగా మహిళలు మాత్రమే పాల్గొనే కేబీసీ..
గత కొన్ని రోజులు క్రితం ఓ వార్త వైరల్ అయింది. కేవలం మహిళలు మాత్రమే పాల్గొనేలా ఓ మీలో ఎవరు కోటీశ్వరులు షోను రూపొందిస్తున్నారని టాక్ వినిపించింది. ఆ షోకు రాధికా శరత్ కుమార్ హెస్ట్గా వ్యవహరించనున్నారని వార్తలు హల్ చల్ అయ్యాయి. అయితే వాటిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ మేరకు రాధికను ప్రశంసిస్తూ అమితాబ్ బచ్చన్ ఓ వీడియోను షేర్ చేశారు.
Recommended Video
అలా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..
కేబీసీ షోకు మహిళ హోస్ట్గా వ్యవహరించడం, ఆ షోలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనడం అనేది హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.. మీ అందరికీ కంగ్రాట్స్.. ఈ షోను విజయవంతం చేస్తావని తెలుసంటూ రాధికపై అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. ఈ షో డిసెంబర్ నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆడిషన్స్ మొదలైనట్లు సమాచారం.