సూపర్ స్టార్స్ రజనీ, అమితాబ్ గోవాలో...
హైదరాబాద్: ఇండియన్ సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్. త్వరలో ఇద్దరూ కలిసి గోవా వెల్ల బోతున్నారు. ఒకే వేదికను పంచుకోబోతున్నారు. నవంబర్ 20న ప్రారంభం అయ్యే 45వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇద్దరూ కలవబోతున్నారు.
అమితాబ్ బచ్చన్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ చీఫ్ గెస్టుగా వ్యవహరించబోతున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో రజనీకాంత్కు ప్రత్యేక అవార్డు ప్రధానం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ మంగళవారం ప్రకటించారు.

ఇద్దరు స్టార్స్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రజనీకాంత్ తన మద్దతు మెడీకి ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











