twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'టైమ్స్ నౌ' ఛానెల్ లో న్యూస్ రీడర్ గా అమితాబ్

    By Srikanya
    |

    జనవరి 30 వ తేదీన అమితాబ్ బచ్చన్ 'టైమ్స్ నౌ' ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కనిపించనున్నారు. 'టైమ్స్ నౌ' ఇయర్-ఎండ్-రౌండప్ పోగ్రాంలో ఆయన సుమారు గంటసేపు పాల్గొంటారు.ఈ విషయాన్ని 'రణ్' చిత్రం కో-ప్రొడ్యూసర్ షీతల్ తల్వార్ మీడియాకు తెలిపారు.'గ్లోబల్ పాలిటిక్స్ కు ఈవెంట్స్ ను కలిపి తయారుచేసిన సే ప్రోగ్రాం ఇది. అమితాబ్ తన జీవిత అనుభవాన్ని రంగరించి వార్తల విశ్లేషణ చేయబోతున్నారు' అని తల్వార్ అన్నారు.

    జనవరి 29 న విడుదల కానున్న 'రణ్' చిత్రం కోసం ఈ తరహా పోగ్రాం డిజైన్ చేసారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రెడీ అయిన ఈ చిత్రంలో ఈ చిత్రంలో మీడియా మేగ్నట్ విజయ్ హర్షవర్దన్ గా అమితాబ్ కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ కు ముందు,తర్వాత ఈ తరహా మీడియా రిలేటెడ్ ఈవెంట్లలో అమితాబ్ పాల్గొనబోతున్నారు.

    ఇక అమితాబ్ ఈ పోగ్రామ్ లలో ఏ విషయాలు మాట్లాడాలి అన్నది ఎంపిక చేసారు. 2009 సంవత్సరంలో విశ్వవ్యాప్త రాజకీయాలకు సంబంధించిన 6 అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు. భారత జాతీయ రాజకీయాలు, టెర్రరిజం, క్రికెట్, స్వైన్ ఫ్లూ, ఆర్థికమాంద్యం, ఒబామా అనే అంశాలు ఇందులో చోటుచేసుకోనున్నాయి అని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X