Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పంక్షన్ లో 'దటీజ్... అమితాబ్' అన్నారంతా...
హైదరాబాద్ : ఉగాది రోజు సాయింత్రం జరిగిన నంది అవార్డుల వేడుకలో అమితాబ్ హుందా అయిన ప్రవర్తన చూసి అంతా దటీజ్ అమితాబ్ అన్నారు. వివరాల్లోకి వెళితే... సీఎంతో కలసి అమితాబ్ లలిత కళాతోరణం బయటికి వచ్చారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన తరవాత అమితాబ్ కారు వద్దకు వస్తుండగా అభిమానులు ఆయనను చూడటానికి తోసుకొచ్చారు.
దాంతో పోలీసులు అదుపు చేస్తుండగా మధ్య వయస్కుడైన ఓ అభిమాని మొక్కల్లోపడిపోయాడు. కారు ఎక్కబోతున్న అమితాబ్ చూసి... ఆ వ్యక్తి మొక్కల్లోంచి లేపమని చెప్పి... అనంతరం ఆ అభిమానితో కరచాలనం చేశారు. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇది చూసిన సినిమావారు,ఫ్యాన్స్ అంతా ఆయన నిరాబండరమైన వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోయారు.
ఇక భారత సినీరంగానికి విశేష కృషి చేసిన ప్రముఖనటుడు అమితాబ్బచ్చన్కు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా అమితాబ్కు ఘనంగా సన్మానం చేశారు. ఎన్టీఆర్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది.
అనంతరం ఎన్టీఆర్ జాతీయ అవార్డు పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు అమితాబ్బచ్చన్ అన్నారు. భారతీయ సినిమారంగంలో మంచిపేరున్న ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు తనకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే భారతీయ సినిమా వందేళ్లు పూర్తిచేసుకుందని ఆయన వెల్లడించారు. జాతీయ సమగ్రతకు సినిమా ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.