Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పంక్షన్ లో 'దటీజ్... అమితాబ్' అన్నారంతా...
హైదరాబాద్ : ఉగాది రోజు సాయింత్రం జరిగిన నంది అవార్డుల వేడుకలో అమితాబ్ హుందా అయిన ప్రవర్తన చూసి అంతా దటీజ్ అమితాబ్ అన్నారు. వివరాల్లోకి వెళితే... సీఎంతో కలసి అమితాబ్ లలిత కళాతోరణం బయటికి వచ్చారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన తరవాత అమితాబ్ కారు వద్దకు వస్తుండగా అభిమానులు ఆయనను చూడటానికి తోసుకొచ్చారు.
దాంతో పోలీసులు అదుపు చేస్తుండగా మధ్య వయస్కుడైన ఓ అభిమాని మొక్కల్లోపడిపోయాడు. కారు ఎక్కబోతున్న అమితాబ్ చూసి... ఆ వ్యక్తి మొక్కల్లోంచి లేపమని చెప్పి... అనంతరం ఆ అభిమానితో కరచాలనం చేశారు. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇది చూసిన సినిమావారు,ఫ్యాన్స్ అంతా ఆయన నిరాబండరమైన వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోయారు.
ఇక భారత సినీరంగానికి విశేష కృషి చేసిన ప్రముఖనటుడు అమితాబ్బచ్చన్కు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా అమితాబ్కు ఘనంగా సన్మానం చేశారు. ఎన్టీఆర్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది.
అనంతరం ఎన్టీఆర్ జాతీయ అవార్డు పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు అమితాబ్బచ్చన్ అన్నారు. భారతీయ సినిమారంగంలో మంచిపేరున్న ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు తనకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే భారతీయ సినిమా వందేళ్లు పూర్తిచేసుకుందని ఆయన వెల్లడించారు. జాతీయ సమగ్రతకు సినిమా ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.