Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనావైరస్కు బిగ్ బీ ప్రశంసలు.. నా సర్కార్ ఆర్జీవికి సాటిలేరు అంటూ పొగడ్తల వర్షం
ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లుతో బిజీగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ లాక్డౌన్లో సినిమాను పూర్తి చేసి సినీ ప్రపంచానికి షాకిచ్చారు. దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ పిరియడ్లో కొవిడ్ 19 కథాంశంతో కరోనావైరస్ అనే చిత్రాన్ని రూపొందించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. లాక్డౌన్లో రూపొందించిన కరోనావైరస్ సినిమాపై అమితాబ్ ప్రశంసలు గుప్పిస్తూ..
నా సర్కార్కు సాటిలేరు
రాంగోపాల్ వర్మపై ట్విట్టర్లో అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ.. ఆయనకు ఎవరూ సాటి రారు. చాలా మందికి ఆయన రాము. నాకు మాత్రం సర్కార్. లాక్డౌన్లో ఓ ఫ్యామిలీ కథాంశంతో మొత్తం సినిమా తీశారు. సినిమా పేరును కరోనావైరస్ పెట్టారు కనుక ఆ సినిమాలో వైరస్ గురించే చెప్పారు. ఇది ఆ సినిమా ట్రైలర్ అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే కరోనావైరస్
ఇక రాంగోపాల్ వర్మ తన సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన మార్గదర్శకాలు, సురక్షిత ప్రమాణాలను చాలా స్ట్రిక్టుగా పాటిస్తూ సినిమాను తెరకెక్కించాం. ఈ విషయంలో అబద్దం చెప్పడం లేదని ఈశ్వర్, అల్లా, జీసస్, ప్రభుత్వంపై ఒట్టేసి చెబుతున్నాను అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
అందరూ వంట చేస్తుంటే.. నేను కరోనావైరస్తో
ఇక టాలీవుడ్ ప్రముఖులపై కూడా వర్మ సెటైర్లు సంధించారు. సినీ ప్రముఖులంతా కరోనా లాక్డౌన్లో ఇల్లు శుభ్రం చేస్తూ, వంట పాత్రలు కడుగుతూ, వంటలు చేస్తూ.. గార్డెనింగ్ చేస్తుంటే.. నేను కరోనావైరస్ మీద సినిమాలు తీశాను అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మంగళవారం రిలీజ్ చేసిన నాలుగున్నర నిమిషాల ట్రైలర్కు మంచి స్పందన లభిస్తున్నది.
Recommended Video
భైరవగీత ఫేం డైరెక్టర్
అంతా
కొత్త
నటీనటులతోపాటు
టాలీవుడ్లో
గుర్తింపు
ఉన్న
నటుడు
శ్రీకాంత్
అయ్యాంగర్
ప్రధాన
పాత్రలో
కరోనావైరస్
తెరకెక్కింది.
ఈ
చిత్రాన్ని
భైరవగీత
ఫేం
అగస్త్య
మంజు
దర్శకత్వం
వహించాడు.
ఈ
చిత్రానికి
డీఎస్ఆర్
మ్యూజిక్
అందించారు.
త్వరలోనే
ఈ
చిత్రాన్ని
ప్రేక్షకుల
ముందుకు
తీసుకొచ్చేందుకు
ప్లాన్
చేస్తున్నారు.