Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Amitabh Bachchan: రెండోసారి బిగ్బీ అమితాబ్కు కరోనా.. ఆయన ఏమన్నారంటే?
కరోనా రక్కసి కారణంగా సినీ ఇండస్ట్రీ రెండేళ్లు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఎన్నో నష్టాలను చవిచూసింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పూర్వ వైభవం వచ్చేందుకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కరోనా మహామ్మారి సినీ ప్రముఖులను పలకరిస్తూ కలవర పెడుతోంది. అయినా వారు దానికి ధైర్యంగా ఎదురు నిలబడుతున్నారు. తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
బాలీవుడ్లో అగ్ర హీరోగా ఎదిగిన స్టార్ అమితాబ్ బచ్చన్. ఆయన్ను అందరూ ముద్దుగా బిగ్బీ అని పిలుచుకుంటారు. ఒకప్పుడు నీ వాయిస్ పనికిరాదు, హీరోగా సూట్ కావు అని విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు.
ఇంట్లో మనిషిగా..
ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి యాంగ్రీ యంగ్ మ్యాన్ వంటి తదితర బిరుదులను సంపాదించారు. ఇక కౌన్ బనేగా కరోడ్ పతి అనే టీవీ షో ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మనిషి అయ్యారు. ఇదిలా ఉంటే కరోనా రక్కసి అప్పట్లో దాదాపుగా ప్రతి ఒక్క సెలబ్రిటీకి సోకిన విషయం తెలిసిందే.
రెండోసారి కరోనా..
అందులో అమితాబ్ బచ్చన్తోపాటు వారి కుటుంబం కూడా ఉంది. తాజాగా మరోసారి.. అంటే రెండోసారి కరోనా బారిన పడ్డారు బిగ్బీ అమితాబ్ బచ్చన్. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
జాగ్రత్తగా ఉండాలని..
అమితాబ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఇటీవల ఆయన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరినట్లు సమాచారం. అయితే అమితాబ్ బచ్చన్కు కొవిడ్ సోకడం ఇది రెండో సారి అని తెలిసిన విషయమే.
కుటుంబం మొత్తానికి కోరనా..
ఇదివరకు 2020 సంవత్సరంలో కొవిడ్ సోకడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకొని.. ఆ తర్వాత కోలుకున్నారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి మహమ్మారి సోకింది. అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్య రాయ్, అమితాబ్ మనవరాలు ఆరాధ్య బచ్చన్కు కూడా కరోనా సోకగా.. అనంతరం కోలుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో..
ఇక అమితాబ్ బచ్చన్ సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కె మూవీలో ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. అలాగే రణ్బీర్ కపూర్, అలియా భట్ తొలిసారిగా జోడి కట్టిన సినిమా బ్రహ్మాస్త్ర. ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. వీటితోపాటు గుడ్ బై, ఊంఛాయి చిత్రాల్లో అమితాబ్ నటిస్తున్నారు.