Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్లాగ్ లో రాసి తిట్లు తింటున్న స్టార్ హీరో
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఇప్పుడు ముంబై జనం తిట్లు తింటున్నారు. ముఖ్యంగా ఆయన బ్లాగ్ రాతలు రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురి అయ్యాయి. దానికి కారణం మరేదో కాదు...ముంబై నగరంలో మెట్రోరైలు కోసం ప్రతిపాదించిన మార్గం తన నివాసం 'ప్రతీక్ష' సమీపం నుంచి వెళ్లడంపై అమితాబ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా తన బ్లాగులో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆయన రాతల్లో ఇలా రాసారు..'చివరికి జరిగేదిదే..! మహానగరంగా పిలుచుకుంటున్న ముంబైలో త్వరలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. కొన్ని చోట్ల భూగర్భం నుంచి, మరికొన్నిచోట్లఫ్లైఓవర్లాంటి సిమెంటు నిర్మాణాలపై నుంచి చకచకా ముందుకు సాగుతుంది.
పనిలో పనిగా 'ప్రతీక్ష'(ఇది అమితాబ్ స్వగృహం పేరు)పై నుంచి దూసుకెళ్తుంది. మెట్రో ఆగమనంతో ఆటోలు, పసుపురంగు క్యాబ్లు గణనీయంగా తగ్గుతాయి. రైలు కూతలే వినిపిస్తాయి. సో...ఏకాంతానికిక బైబై. హలో ప్రయాణికులూ..అంటూ గడుపుతా..' నంటూ అమితాబ్ మెట్రో మార్గంతో తన ఏకాంతానికి ఎసరొచ్చిందంటూ తీవ్రంగా తన బ్లాగులో రాసుకున్నాడు. ఈ రాతలు చదివిన వారు..ఎవరికి తోచిన విధంగా వారు అమితాబ్పై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయనపై స్వార్థపూరితుడివంటూ దుమ్మెత్తిపోశారు. ప్రజల ప్రయోజనాలు పట్టవా? నీ క్షేమమే చూసుకుంటావా? అంటూ నిలదీశారు. మొత్తానికి అమితాబ్ మరో వివాదానికి తెరలేపాడు.