కమల్ హాసన్ దర్శకత్వంలో ... అమితాబ్, రేఖ?

కమలహాసన్, కాజోల్ జంటగా వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించ తలపెట్టిన 'మర్మయోగి'లో ఆ ఇద్దరూ భార్యాభర్తలుగా నటించవచ్చని భావిస్తున్నారు. అందులోనూ రేఖతో మళ్లీ కలిసి నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కొద్ది రోజుల క్రితమే అమితాబ్ వెల్లడించారు. ఇప్పుడు మంచి రోల్ వస్తే రేఖతో కలిసి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో వాల్ట్ డిస్నీ సంస్థ ఆ ఇద్దరినీ మరోసారి తెరపై జంటగా చూపడానికి సన్నాహాలు చేస్తోంది.'మర్మయోగి'ని కమలహాసన్ స్వయంగా డైరెక్ట్ చేయనుండటం గమనార్హం. యేమో మళ్ళీ ఆ జంట అప్పటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూద్దాం....


Click it and Unblock the Notifications











