కొరియాగ్రాఫర్ నుండి దర్శకుడుగా ఎదిగిన ప్రభుదేవా,లారెన్స్ హీరోలుగా మారి సినిమాలు చేస్తూండటం తెలిసిందే. అదే రూటులో ఇప్పుడు అమ్మ రాజశేఖర్ కూడా ప్రయాణం పెట్టుకున్నాడు. నిజానికి 'ఖతర్నాక్' , 'టక్కరి' సినిమాలతో అమ్మో రాజశేఖర్ అనిపించుకున్న ఆయన ప్రస్తుతం 'బీబత్సం' అనే సినిమాను తన దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. అందులో అతని సోదరుడే హీరో. ఇక ఆయన హీరోగా నటించే చిత్రం పేరు 'పోరు'. తమిళ,తెలుగు భాషల్లో తయారయ్యే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణిని అడిగారని తెలుస్తోంది. ఆమె కూడా పాత్ర నచ్చి ఒప్పుకుందని వార్తలు వినవస్తున్నాయి. ఆగస్టు 15న ప్రారంభమయ్యే ఈ సినిమాలో శ్రీహరి ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.