Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు హీరోయిన్ ఈ సారి సిద్దార్ధ సరసన...
మహేష్ బాబు సరసన అతిధి చిత్రంలో చేసిన అమృతారావు గుర్తుండే ఉంటుంది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో మళ్ళీ కనిపించనుంది. దిల్ రాజు నిర్మాతగా సిద్దార్ధ హీరోగా రూపొందే చిత్రానికి ఆమెను ఎంపికచేసారు. మొదట ఈ పాత్రకు త్రిషను అనుకున్నారు కానీ తర్వాత అమృతరావు అయితే బావుంటుందని ఫైనలైజ్ చేసారు. కరీంనగర్ కి చెందిన వేణు శ్రీరామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ గా ఓహ్ మై ప్రెండ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది.