Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎమీ జాక్సన్ ఇష్యూ: నెపం నయనతారపై నెట్టారు!
హైదరాబాద్: స్టార్ హీరో సూర్య హీరోగా విక్రమ్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్'. ఈ చిత్రంలో నయనతార, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. ఈ సినిమా నుండి అమీ జాక్సన్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో తన పాత్రకంటే నయనతార పాత్రకు అధిక ప్రాధన్యం ఉండటంతో ఎమీ జాక్సన్ తప్పుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే యూనిట్ సభ్యులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఎమీ జాక్సన్ నటిస్తోందని తెలిపారు.
ఈ సినిమాలో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి నార్మల్ క్యారెక్టర్ కాగా మరొకటి ఆత్మ క్యారెక్టర్. ‘మాస్' సినిమా హైదరాబాద్ లో షూటింగ్ ను జరుపుకుంటోంది. సన్నివేశాలు హైదరాబాద్ కోఠిలోని ఉమెన్స్ కాలేజ్, సుల్తాన్ బజార్లో చిత్రీకరణ జరిపారు.
సూర్య చేసినట్లుగా అటు మాస్, ఇటు క్లాస్ రోల్స్ సౌత్ లో ఒకే సారి చేసే హీరోలు లేరనే చెప్పాలి. సికిందర్ లో తన స్టైలిష్ లుక్ లో అదరకొట్టిన సూర్య ఈ సారి పూర్తి మాస్ లుక్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అజిత్, విజయ్ల తర్వాత వేగంగా పేరు తెచ్చుకుంటున్న నటుడు సూర్య. వైవిధ్య నటనతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినీజనాలకు కూడా దగ్గరయ్యారు. ఎప్పటినుంచో వెంకట్ప్రభు దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడా ప్రాజెక్టు మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
'మంగాత్తా', 'బిరియాని' విజయాలతో హవా చాటుకుంటున్న వెంకట్ప్రభు తాజాగా సూర్యతో మాస్మసాలా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'మాస్' అని పేరు కూడా పెట్టారు. స్టూడియో గ్రీన్ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్నారు.