Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా పోరాటం కొనసాగుతుంది: హీరో బహిరంగ లేఖ
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు వచ్చిన వార్తలను సినీ నటుడు విశాల్ ఖండిచారు. ఈ ఉపఎన్నికలో తన మద్దతు ఎవరికి ఉండదని విశాల్ ప్రకటించాడు.
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు వచ్చిన వార్తలను సినీ నటుడు విశాల్ ఖండిచారు. ఈ ఉపఎన్నికలో తన మద్దతు ఎవరికి ఉండదని విశాల్ ప్రకటించాడు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక బహిరంగ లేఖ రాశాడు.
ఆర్కే నగర్ అసెంబ్లీ
ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని తాను తీసుకున్న నిర్ణయం వెనుక ఏ ఒక్కరి ప్రోద్భలం లేదన్నా రు. ఆర్కే నగర్ వాసులకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను స్వతహాగా ఈ నిర్ణయం తీసుకుని నామినేషన్ వేసినట్టు తెలిపారు.
పవర్ పాలిటిక్స్
అయితే, పవర్ పాలిటిక్స్ తన నామినేషన్ను తిరస్కరణకు గురిచేశాయన్నారు. అదేసమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే, ఇప్పటివరకు తాను చేసిన పోరాటంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.
సేవ చేయాలనే ఉద్దేశంతో
ప్రజలకు మనస్ఫూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను నామినేషన్ వేశాను. నాపై ఎవరి ఒత్తిడి లేదు. నేను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురవడం నిజంగా అనైతికం. దీన్ని బట్టి ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటో తమిళనాడు ప్రజలు అర్థం చేసుకోవచ్చు' అన్నారు.
కొత్త ఉత్తేజంతో
ఇప్పుడు తన నామినేషన్ విషయం కంటే దృష్టి సారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా తప్పిపోయిన కన్యాకుమారి జాలరులను వెతికి పట్టుకోవడంలో అందరూ సహకరించాలని విశాల్ కోరారు. అలాగే కొత్త ఉత్తేజంతో మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని పేర్కొన్నారు.