Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డిసెంబర్ 14న ‘అనగనగా ఓ ప్రేమకథ’
విరాజ్ జె.అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా థౌజెండ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యానర్పై కె.ఎల్.రాజు నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ'. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు మాట్లాడుతూ - అశ్విన్, రిద్ది, రాధా బంగారు సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతో మంచి ప్రేమకథను తెరకెక్కించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఓ కూతురుని మంచి దారిలో పెట్టడానికి తండ్రి ఏం చేశాడనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. డిసెంబర్ 14న సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు ప్రతాప్ తాతం శెట్టి మాట్లాడుతూ - ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. అహ్లాదకరంగా ఉంటూ ప్రేక్షకులు మంచి వినోదం పంచుతుంది. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
సునయన మాట్లాడుతూ - మా మామగారు కె.ఎల్.ఎన్ రాజుగారు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో.. ఈ సినిమా చేశాం. సినిమా కోసం అందరం కష్టపడ్డాం. ఈ నెల 14న మా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు.
విరాట్ జె.అశ్విన్ మాట్లాడుతూ - రాజుగారి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. మావయ్య మార్తాండ్ కె.వెంకటేశ్గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. డిసెంబర్ 14న విడుదలవతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
రిద్ది కుమార్ మాట్లాడుతూ - తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్రమిది. మంచి పాత్ర చేశాను. ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పిస్తాను అన్నారు.