Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శేఖర్ కమ్ముల కాపీ కొట్టడం లేదు: నయనతార
హైదరాబాద్: సాధారణంగా రీమేక్ సినిమా అంటే ఒరిజనల్ లో ఉన్న దాన్ని మార్చటానికి ఇష్టపడరు. మార్చాలనుకున్నప్పుడు ఎందుకు అంత డబ్బు పోసి కొనుక్కోవటం అనే ఆలోచనతో యాజటీజ్ గా చేయటానికి ఆసక్తి చూపిస్తూంటారు. అయితే శేఖర్ కమ్ముల దానికి విరుధ్దమని నయనతార చెప్తోంది. ఆయన తో నయనతార ప్రస్తుతం అనామిక చిత్రం చేస్తోంది. ఆ చిత్రం కహానీ రీమేక్ అని తెలిసిందే.
నయనతార మాట్లాడుతూ.. 'దర్శకుడు శేఖర్ కమ్ముల కేవలం కహానీ మూలకథను మాత్రమే తీసుకుని విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తిగా కహానీ చిత్రాన్ని యధాతధం గా తీసుకుని చేయడం లేదు. తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది'అని తెలిపింది.
అలాగే... ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. దసరా సందర్భంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.
టాకీపార్ట్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో నయనతారతో పాటుగా వైభవ్ ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. తెలుగులో క్రియేటివ్ దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల మొదటి సారిగా ఓ రీమేక్ చిత్రాన్ని చేస్తుండడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'అనామిక'. వయాకమ్ 18 మోషన్స్ పిక్చర్స్, ఎండెమోల్ ఇండియా, లాగ్లైన్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు మీడియాకు తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.