Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టైటిల్లో మంచి ఫీల్...కథలో కొత్త ఫ్లేవర్ ఉంది: శేఖర్ కమ్ముల
హ్యాపీ డేస్' ఫేం వంశీకృష్ణ హీరోగా 'ఆనంద్ రవి' దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పేరెంట్స్'. టేక్ వన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం ఆగస్టు 5న లాంఛనంగా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.."ఈ సినిమా టైటిల్లో మంచి ఫీల్ ఉంది. కథలో కూడా కొత్త ఫ్లేవర్ ఉంది. అనుకున్నది అనుకున్నట్లు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. 'ఆనంద్' రవి నా దగ్గర దర్శకత్వ శాఖలో చేశాడు' అని అన్నారు.
అలాగే వినాయకుడు దర్శకుడు సాయి కిరణ్ అడవి మాట్లాడుతూ...'ఆనంద్' రవి ఈ కథ చెప్పినప్పుడు ఇలాంటి కథ నేనెందుకు తయారు చేయలేదని జెలసీ ఫీలయ్యానని అన్నారు. ఇక దర్శకుడు 'ఆనంద్' రవి మాట్లాడుతూ - "స్నేహితులందరం కలిసి ఈ బేనర్ ఆరంభించాం. ఈ సినిమాలో హీరో తన తలిదండ్రుల కోసం వెతుకుంటాడు. అతని పేరంట్స్ ఉన్నారా? లేదా? ఉంటే అతనికి దొరికారా? లేదా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆగస్ట్ 5న ఈ షూటింగ్ ఆరంభిస్తున్నాం. నవంబర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు. వంశీకృష్ణ, రుచిక బబ్బర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె.బాలచంద్రన్, పాటలు: వనమాలి, కెమెరా: శ్యామ్దత్, ఎడిటింగ్: అనిల్కుమార్ బొంతు.