Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
టైటిల్లో మంచి ఫీల్...కథలో కొత్త ఫ్లేవర్ ఉంది: శేఖర్ కమ్ముల
హ్యాపీ డేస్' ఫేం వంశీకృష్ణ హీరోగా 'ఆనంద్ రవి' దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పేరెంట్స్'. టేక్ వన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం ఆగస్టు 5న లాంఛనంగా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.."ఈ సినిమా టైటిల్లో మంచి ఫీల్ ఉంది. కథలో కూడా కొత్త ఫ్లేవర్ ఉంది. అనుకున్నది అనుకున్నట్లు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. 'ఆనంద్' రవి నా దగ్గర దర్శకత్వ శాఖలో చేశాడు' అని అన్నారు.
అలాగే వినాయకుడు దర్శకుడు సాయి కిరణ్ అడవి మాట్లాడుతూ...'ఆనంద్' రవి ఈ కథ చెప్పినప్పుడు ఇలాంటి కథ నేనెందుకు తయారు చేయలేదని జెలసీ ఫీలయ్యానని అన్నారు. ఇక దర్శకుడు 'ఆనంద్' రవి మాట్లాడుతూ - "స్నేహితులందరం కలిసి ఈ బేనర్ ఆరంభించాం. ఈ సినిమాలో హీరో తన తలిదండ్రుల కోసం వెతుకుంటాడు. అతని పేరంట్స్ ఉన్నారా? లేదా? ఉంటే అతనికి దొరికారా? లేదా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆగస్ట్ 5న ఈ షూటింగ్ ఆరంభిస్తున్నాం. నవంబర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు. వంశీకృష్ణ, రుచిక బబ్బర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె.బాలచంద్రన్, పాటలు: వనమాలి, కెమెరా: శ్యామ్దత్, ఎడిటింగ్: అనిల్కుమార్ బొంతు.