తెరపై అనంత పద్మనాభుడి కథ..డిటేల్స్

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం అంతులేని సంపదతో వార్తల్లో నిలుస్తోంది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో సుమారు ఐదు లక్షల కోట్ల ఆస్తుల వరకు కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. వాటి విలువ అంత ఉండదని ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నప్పటికీ ఆ సంపద విలువ భారీగానే ఉంటుందనే వారూ ఉన్నారు. ఈ ఐదు నేలమాళిగలలో కంటే ఆరోగదిలో ఇంతకంటే ఎక్కువ సంపద ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆరో నేలమాళిగ తెరవకూడదని దానికి నాగబంధం ఉందని భక్తులు, ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నారు. కేరళ ప్రభుత్వం ఆరోనేల మాళిగను తెరవడానికి సిద్ధమైన సందర్భంలో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరో గదిని తాము ఆదేశించే వరకు తెరవకూడదని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా గురువారం రోజు సుప్రీంకోర్టు ఆరో నేలమాళిగ విషయంలో తమ ఆదేశాలు జారీ చేయనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలు కోసం ఇటు కేరళ ప్రభుత్వం, అటు భక్తులు సైతం వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











