ఇంకా నాకు ఆ వయసు రాలేదు.. ఆ కేటగిరిలో పడలేదు.. అనసూయ కొంటె కామెంట్ వైరల్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా కేసుల గురించి హాట్ టాపిక్ అవుతోంది. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కరోనా విజృంభణ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా పాజిటివ్ అని వస్తోంది. అయితే ఈ క్రమంలో అనసూయకు కరోనాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో అనసూయకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అనసూయ పూర్తిగా క్వారంటైన్కు పరితమైందన్న విషయం తెలిసిందే.

తాజాగా అలా..
తాజాగా అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాంట్రవర్సీలు వచ్చినా, ట్రోలింగ్ జరిగినా కూడా అనసూయ ధీటుగా నిలబడుతుంది. నెటిజన్లు అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తుంటుంది.

పలు రకాల ప్రశ్నలు..
తాజాగా అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఏదైనా అడగండి చెబుతాను చాలా రోజులైంది మాట్లాడక అని అనసూయ తన ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలో అనసూయను రకరకాల ప్రశ్నలు అడిగారు. వాటికి అనసూయ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.

పలు ప్రాజెక్ట్లు..
అనసూయ ఇప్పుడు పలు ప్రాజెక్ట్ల్లో నటిస్తోంది. మొత్తంగా తమిళ, తెలుగు, మళయాలి మూడు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. రెండు చిత్రాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయని, ఇంకా నాలుగు ప్రాజెక్ట్లు సెట్స్ మీదున్నాయని చెప్పుకొచ్చింది.
Recommended Video

ఆ వయసు రాలేదు..
మీరు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా? అంటూ ఓ నెటిజన్ అడిగాడు. దానికి అనసూయ కొంటెగా స్పందించింది. నాకు ఇంకా ఆ వయసురాలేదు.. నేను ఆ క్యాటగిరీకి చెందను అని చెప్పుకొచ్చింది. 45 ఏళ్లు దాటిన వారంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











