Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఓటీటీలో విడుదలకు సిద్దమైన యాంకర్ అనసూయ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలెంటెడ్ అండ్ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కొత్త సినిమా డైరెక్ట్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ సంస్థ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. యాంకర్ అనసూయ ప్రస్తుతం నటిగా కూడా మంచి మంచి పాత్రల్లో జనాలను మేప్పిస్తోంది. రెగ్యులర్ గ్లామరస్ రోల్స్ కాకుండా డిఫరెంట్ కంటెంట్ కథలను ఎంచుకుంటోంది.
ఇక ఇటీవల ఆమె ఎంతో ఇష్టపడి చేసిన ఎమోషనల్ మూవీ 'థ్యాంక్ యు బ్రదర్'. మంచి సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ వలన సినిమా థియేటర్లు మూత పడడంతో ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆహా యాప్ నుంచి మంచి ఆఫర్ రావడంతో డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 7 నుంచి సినిమా ఆహా యాప్ లో సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక అనసూయ ప్రస్తుతం మరికొన్ని విభిన్నమైన సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా అనసూయ భయంకరమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సునీల్ భార్యగా ఒక డేంజరస్ మహిళగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లోనే అనసూయ బిజీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక ఫొటో కూడా పోస్ట్ చేసింది.