Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తన పాత్ర గురించి వెల్లడించి సర్ప్రైజ్ చేసిన అనసూయ!
Recommended Video
ప్రముఖ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గాయత్రి'. మదన్ రామిగాని ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు మెయిన్ లీడ్గా చేస్తున్న 42వ చిత్రం ఇది. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
|
తన పాత్ర గురించి వెల్లడిస్తూ అనసూయ ట్వీట్
‘గాయిత్రి' సినిమాలో తన పాత్ర గురించి అనసూయ అభిమానులకు వివరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది..' అంటూ ఈ చిత్రంలో తాను పోషిస్తున్న శ్రేష్టా జయరామ్ పాత్రను పరిచయం చేసింది.
అనసూయ లుక్ అదుర్స్
‘గాయిత్రి' చిత్రంలో అనసూయ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఆమె పవర ఫుల్ జర్నలిస్టుగా కనిపించడంతో పాటు అందంతో కూడా ఆకట్టుకుంటుందని స్పష్టమవుతోంది.
మోహన్ బాబు పోస్టర్
"ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే" అంటూ సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగుతో కొన్ని రోజుల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ డైలాగ్ బట్టే ఆయన పాత్ర సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పవర్ ఫుల్ క్యారెక్టర్
మోహన్ బాబు కెరీర్లో పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాలు ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు. ఆ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ‘గాయిత్రి' సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
మంచు విష్ణు
'గాయత్రి' చిత్రంలో విష్ణు మంచు కూడా నటిస్తున్నారు. విష్ణుకు జోడిగా హీరోయిన్ శ్రియ నటిస్తోంది.
‘గాయిత్రి'గా నిఖిలా విమల్
ఈ చిత్రంలో టైటిల్ రోల్ నిఖిలా విమల్ నటిస్తున్నారు. మోహన్ బాబు కూతురిగా ఆమె కనిపించబోతున్నారు. ‘గాయిత్రి' పాత్ర చుట్టూ సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 9 ను విడుదల తేదీగా ఖరారు చేసిన 'గాయత్రి' చిత్రాన్ని మోహన్ బాబు తమ సొంత బేనర్ 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్'పై నిర్మిస్తుండగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.
టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి, ఆర్ట్: చిన్న, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య. కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్, కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్, నిర్మాత: డా. మోహన్ బాబు యమ్, దర్శకత్వం: మదన్ రామిగాని.