Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
నాగార్జున మరదలిగా యాంకర్ అనసూయ?
హైదరాబాద్: ‘మనం' ఘనవిజయం తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో కల్యాణ్కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మనం' చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో నాగ్ రెండు పాత్రలు చేయనున్నారు. సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని అంటున్నారు. యాంకర్ అనసూయ బుల్లి తెర ప్రేక్షకులు సుపరిచితం. ఆమె పాత్ర కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉంటుందని అంటున్నారు.