Don't Miss!
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మంచు హీరో కి కమిటైన 'అందాల రాక్షసి'
ఇప్పటికే కథాచర్చలు ముగిశాయి. వచ్చే నెల 15 నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇందులో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీని ఎంపిక చేసుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. 'అందాల రాక్షసి'తో లావణ్య టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇటీవలే విష్ణు, లావణ్యలపై ఫొటో షూట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
'దేనికైనా రెడీ'సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే వీరు పోట్ల దర్శకత్వంలో చేయబోయే తన తదుపరి చిత్రానికి సంబంధించిన గెటప్, కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసుకునే పనిలో విష్ణు నిమగ్నమయ్యారు. ఇక తనకు 'దేనికైనా రెడీ'నుంచి ఇక తనకు వరస విజయాలు ప్రారంభమయ్యినట్లే అంటున్నారు. ఇన్నాళ్లకు మంచు విష్ణుకు బ్రేక్ వచ్చిందంటున్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ...'దేనికైనా రెడీ'తర్వాత స్క్రిప్ట్ నచ్చితేనే తదుపరి సినిమాకి రెడీ చెబుతాను అన్నారు . ఈ ఆలోచనలో భాగంగా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలిసింది. మనోజ్తో 'బిందాస్' వంటి హిట్ చిత్రానికి, నాగార్జునతో 'రగడ' వంటి భారీ చిత్రాలకి వీరు పోట్ల దర్శకత్వం వహించిన వహించారు. దాంతో ఈ కొత్త కాంబినేషన్ పైనే మంచి అంచనాలు ఉండనున్నాయి.