twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు హీరో కి కమిటైన 'అందాల రాక్షసి'

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'అందాల రాక్షసి'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన లావణ్య కు ఇప్పుడు మరో ఆఫర్ వరించింది. 'దేనికైనా రెడీ'తో విజయాన్ని దక్కించుకున్న హీరో మంచు విష్ణు సరసన ఆమె ఎంపికైంది . విష్ణు మరోసారి వినోదాన్ని పంచేందుకు సన్నద్ధమవుతున్నారాయన. 24 ఫ్రేమ్స్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి వీరు పోట్ల దర్శకత్వం వహిస్తారు. మోహన్‌బాబు నిర్మాత.

    ఇప్పటికే కథాచర్చలు ముగిశాయి. వచ్చే నెల 15 నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇందులో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీని ఎంపిక చేసుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. 'అందాల రాక్షసి'తో లావణ్య టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవలే విష్ణు, లావణ్యలపై ఫొటో షూట్‌ కూడా నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

    'దేనికైనా రెడీ'సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే వీరు పోట్ల దర్శకత్వంలో చేయబోయే తన తదుపరి చిత్రానికి సంబంధించిన గెటప్, కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసుకునే పనిలో విష్ణు నిమగ్నమయ్యారు. ఇక తనకు 'దేనికైనా రెడీ'నుంచి ఇక తనకు వరస విజయాలు ప్రారంభమయ్యినట్లే అంటున్నారు. ఇన్నాళ్లకు మంచు విష్ణుకు బ్రేక్ వచ్చిందంటున్నారు.

    మంచు విష్ణు మాట్లాడుతూ...'దేనికైనా రెడీ'తర్వాత స్క్రిప్ట్ నచ్చితేనే తదుపరి సినిమాకి రెడీ చెబుతాను అన్నారు . ఈ ఆలోచనలో భాగంగా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలిసింది. మనోజ్‌తో 'బిందాస్' వంటి హిట్ చిత్రానికి, నాగార్జునతో 'రగడ' వంటి భారీ చిత్రాలకి వీరు పోట్ల దర్శకత్వం వహించిన వహించారు. దాంతో ఈ కొత్త కాంబినేషన్ పైనే మంచి అంచనాలు ఉండనున్నాయి.

    English summary
    now Manchu Vishnu is going to be paired with Lavanya Tripathi of ‘Andala Rakshasi “for his next project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X