Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చంద్రసిద్ధార్థ 'అందరి బంధువయ' స్టోరీ లైన్
'ఆ నలుగురు' వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని డైరక్ట్ చేసిన చంద్ర సిద్దార్ద తాజాగా 'అందరి బంధువయ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, పద్మప్రియ జంటగా నటించిన ఈ చిత్రం కథ ఏ విధంగా ఉంటుందో ఆయన మీడియాకు వివరించారు.చంద్ర సిద్దార్ధ మాట్లాడుతూ.. నవతరం ఆలోచనలకు దగ్గరగా ఉండే కథ ఇది. కార్పొరేట్ సంస్థలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తుంటారు హీరో, హీరోయిన్స్. తాము బ్రతికేదే నాగరిక ప్రపంచం అనుకొంటూ ఏ విలువల్నీ, అనుబంధాల్నీ దూరం చేసుకుంటారు. అయితే కథ కొనసాగుతుండగా..తాము దేన్ని దూరం చేసుకొంటున్నామో తెలుసుకొంటారు. మన మూలాల్ని వెదుక్కొంటూ వాళ్లు చేసిన ప్రయాణం హృదయాన్ని హత్తుకొంటాయన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆడియోను సైతం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో నరేష్, ఆర్.కె., విజయ్, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, ఆర్యన్ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: జె.కె.గుమ్మడి, పాటలు: చైతన్యప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్.